Bigg Boss: నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు..! బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్

Bigg Boss: నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు..! బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్
Bigg Boss: నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు..! బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 10 కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కూడా గత సీజన్ తరహాలో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం అగ్నిపరీక్ష గేమ్ షో ద్వారా పలువురు కామనర్స్‌ను ఎంపిక చేసి వారిలో కొందరిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారు.

సీజన్ వన్ తరహాలోనే ఈసారి కూడా బిందు మాధవి, నవదీప్, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు కామనర్స్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఎంపికయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ (Bigg Boss) ఓటీటీ విజేతగా నిలిచిన బిందు మాధవిపై మాజీ కంటెస్టెంట్, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బిందు మాధవి వ్యాఖ్యలపై నటరాజ్ మాస్టర్ ఫైర్

నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ షోలో ఒకసారి కాదు, రెండుసార్లు పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీలోనూ కనిపించారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే.

తాజాగా అగ్నిపరీక్ష ఎపిసోడ్‌లో భాగంగా ఆర్జే సరదాగా జడ్జిగా ఉన్న బిందు మాధవిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గతంలో బిగ్ బాస్ ఓటీటీ సమయంలో జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు. ‘‘శూర్పణఖ.. ఇదిగో నా బాణం’’ అంటూ ఓ కంటెస్టెంట్ తనపై చేసిన వ్యాఖ్యల సమయంలో ఎలా అనిపించిందని బిందు మాధవిని అడిగారు.

దీనికి స్పందించిన బిందు మాధవి.. ఆ సమయంలో తాను చాలా ఇరిటేట్ అయ్యానని చెప్పారు. అయితే ఇలాంటి వాళ్లు కూడా ఉండాలి కాబట్టి వారికి థాంక్స్ చెప్పాలని అనిపించిందని పేర్కొన్నారు.

‘మాట జాగ్రత్త’ అంటూ వార్నింగ్

బిందు మాధవి చేసిన ఈ వ్యాఖ్యలపై నటరాజ్ మాస్టర్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ.. ‘‘అలాంటి వాళ్లు కూడా ఉండాలా? అలాంటి వాళ్లు అంటే ఏంటి? మాట జాగ్రత్త’’ అంటూ హెచ్చరించారు.

‘‘అలాంటి వాళ్లు అంటావా? అసలు ఏం అనుకుంటున్నావు? ఒక ప్లాట్‌ఫామ్‌పై కూర్చుని మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా? ఆ గేమ్ అప్పుడే అయిపోయింది. అంతా మార్చిపోయి.. నా పాప బర్త్‌డేకి కూడా నిన్ను పిలిచాను. ఇప్పుడు ఇలా మాట్లాడతావా?’’ అంటూ నటరాజ్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ‘‘అక్కడ అడిగిన దాని గురించి మాట్లాడు.. నీ గురించి నువ్వు చెప్పుకో. అంతే కానీ ‘అలాంటి వాళ్లు’ అంటూ నా గురించి మాట్లాడతావా? ‘అలాంటి వాళ్లు’ అని అన్నావు కదా.. ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు’’ అంటూ బిందు మాధవికి వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిందు మాధవి వ్యాఖ్యలు, నటరాజ్ మాస్టర్ స్పందనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.