తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో నలుగురు పోలీసులు అరెస్ట్..

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు కాజేసిన మోసగాడు

తమిళనాడులోని తూత్తుకుడి (టుటికోరిన్) ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో నలుగురు పోలీసులను సీబీ-సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ లను పోలీసులు చిత్రహింసలు పెట్టి మరీ వారి మృతికి కారణమైనారని  ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు అధికారులు తెలిపారు.  అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా రాత్రి 9 గంటలకు మూసి వేయాల్సిన తమ సెల్ ఫోన్ షాపును వీరు మరో పావుగంట పాటు తెరచి ఉంచడంతో తండ్రీ కొడుకులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ షాపు తెరచి ఉండటాన్ని చూసిన పోలీసులు.. మొదట తండ్రిని ఆ తర్వాత కుమారుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరినీ రాత్రంతా పోలీసులు హింసించారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరోజు తేడాలో చనిపోయారు కూడా.

కాగా ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. అయితే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. ఈ కేసులో ఇన్ స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్ స్పెక్టర్లు రఘు గణేశ్, బాలకృష్ణన్ లతో పాటు కానిస్టేబుల్ మురుగన్ లను అరెస్ట్ చేశామని రాష్ట్ర సీఐడీ విభాగం క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు. ఈ కేసును 12 స్పెషల్ టీములు అన్ని కోణాల్లో విచారిస్తున్నాయని సీబీసీఐడీ ఐజీ శంకర్ వివరించారు. నిందితులపై తొలుత ఐపీసీ సెక్షన్ 312 కింద కేసు రిజిస్టర్ చేశామని.. మొదట అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆపై లాకప్ డెత్ జరిగినట్టు ఒక్కో ఆధారమూ బయటపడుతుంటే.. 302 సెక్షన్ కు మార్చారు.. కాగా త్వరలో కేసును సీబీఐకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.