మహారాష్ట్రలో దారుణం.. చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి

ప్రాణం తీసిన ఈత సరదా

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జల్నా జిల్లాలో ఘోరం జరిగింది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్‌వాడీకి చెందిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. అయితే ఆ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. దీంతో చెవులోకి దిగిన ఐదుగురు చిన్నారులు చెరువు పూడికలో చిక్కుకుపోయారు.

అలాగే.. అటువైపుగా వెళ్తున్నవారు గమనించి బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే. అప్పటికే బాలికులు ఐదుగురు మృతిచెందినట్లు ఫూలంబ్రీ పీహెచ్‌సీ అధికారులు వెల్లడించారు. మృతులందరూ ఐదు నుంచి ఏడేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.