మహర్షి కాపీ కధే ? అయినా ఆ దర్శకుడు కంప్లైంట్ చేయడు !

సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తు ఆయనకు నిజంగానే మెమరబుల్ మూవీగా మారింది. సినిమా మీద మిశ్రమ స్పందన వస్తున్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రస్తుతం దీని మీద కాపీ కధ అనే ముద్ర పడడడం టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ఇది వంశీ పైడిపల్లి సొంత కధ కాదని ఒరిజినల్ కథాంశం తనదే అని దిల్ రాజుకు సన్నిహితుడయిన టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తను చెప్పిన కధని డెవలప్ చేసి ఏకంగా సినిమా ఎలా తీస్తారని దిల్ రాజుని శ్రీ వాస్ ప్రస్నించాడట. అయితే దిల్ రాజుతో ఉన్న చనువు దృష్ట్యా ఈ విషయం మీద ఎక్కడా తను మాట్లాడనని శ్రీ వాస్ మాటిచ్చారట, ఈ క్రమంలో శ్రీ వాస్ కి శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమాకి ఛాన్సిచ్చారట దిల్ రాజు. అలా ఈ విషయం బయటకి పొక్కి వివాదంగా మారకుండా దిల్ రాజు తనదైన ట్రీట్మెంట్ చేశారన్న ప్రచారం సాగుతోంది.