పది రూపాయల కోసం హత్య

love-murder-karnataka

సినిమాహాల్‌లో పది రూపాయల పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన. తూర్పు బెంగళూరులోని భారతీనగర్‌లో ఉన్న లావణ్య థియేటర్‌‌లో కాంచన-3 సినిమా చూసేందుకు ఆస్టిన్ టౌన్‌కు చెందిన భరణిధరణ్ (38) తన కజిన్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు. బైకును థియేటర్ ఆవరణలో పార్కింగ్ చేశాడు. వెంటనే అక్కడకు వచ్చిన సెల్వరాజ్ పార్కింగ్ ఫీజు రూ.10 ఇమ్మన్నాడు. అందుకు భరణిధరణ్ ఒప్పుకోలేదు. నీకెందుకివ్వాలి అంటూ ముందుకెళ్లబోయాడు. వెంటనే అతన్ని అడ్డుకున్న సెల్వరాజ్ శేఖర్ అంటూ గట్టిగా అరిచాడు. అదే థియేటర్‌లో హౌస్ కీపింగ్ పని చేసే శేఖర్ సెల్వరాజ్ పిలవగానే పరిగెత్తుకొచ్చాడు. ఇద్దరూ కలిసి భరణిపై సెల్వరాజ్ దాడిచేశాడు. థియేటర్ వెనక్కి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన భరణిని థియేటర్ యాజమాన్యం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం పరారీలో వున్న నిందితులు సెల్వరాజ్, శేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు.