టాలీవుడ్ నుంచి ఇటీవల విడుదలై సూపర్ హిట్గా నిలిచిన చిత్రం ‘పెద్ది’(Peddi). రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ భారీగా వచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాలపై మాత్రం ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ప్రత్యేకంగా జాన్వీ కపూర్కు సంబంధించిన కొన్ని సీన్స్తో పాటు మరికొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు.
ఒక ఫిల్మ్ మేకర్గా తన ఉద్దేశం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే తప్ప, ఎవరినీ కించపరచడం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాసెస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ను సీరియస్గా తీసుకుంటానని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటానని సోషల్ మీడియా ద్వారా హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, ‘పెద్ది’ సినిమాలో వివాదాస్పదంగా మారిన సన్నివేశాలను తొలగించి, రీ-ఎడిట్ చేసిన కొత్త ప్రింట్ను త్వరలోనే విడుదల చేస్తామని కూడా వెల్లడించారు. దీంతో బుచ్చిబాబు తాజా స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
