మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రం పెద్ది (Peddi)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్తో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దద్దరిల్లబోతుండగా, ఓపెనింగ్స్ విషయంలో మేకర్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు.
పాన్-ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో, పలు స్పెషల్ ఫార్మాట్లలో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆడియెన్స్కు అదిరిపోయే అనుభూతిని ఇచ్చే 4DX వెర్షన్ కూడా ఉంటుందని ముందే అనౌన్స్ చేశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ డ్రామా జానర్ సినిమాలు 4DXలో చూస్తే కిక్ వేరే లెవెల్లో ఉంటుందని తెలిసిందే.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఇండియా వ్యాప్తంగా ‘పెద్ది’ 4DX వెర్షన్ బుకింగ్స్ ఎక్కడా ఓపెన్ కాలేదు.
హైదరాబాద్ సహా నార్త్ ఇండియాలోని కీలక నగరాల్లో బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా వంటి ఫార్మాట్లకు బుకింగ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, 4DX మాత్రం పూర్తిగా మిస్ అయ్యింది.
దీంతో 4DX వెర్షన్ రిలీజ్ను మేకర్స్ రద్దు చేశారా? లేక చివరి నిమిషంలో అప్డేట్ ఇస్తారా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ అంశంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి రాబోయే గంటల్లో ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
