విక్టరీ స్టార్ వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో మూడోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి వెంకీ–త్రివిక్రమ్ జోడీ రెడీ అవుతోంది. షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదే సమయంలో ఈ సినిమా పూర్తయ్యాక వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. అయితే, ఈ సినిమా షూటింగ్లో వెంకీ జాయిన్ కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, దాంతో షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
అక్టోబర్లో ‘ఆదర్శ కుటుంబం’ ను విడుదల చేసి, ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాను కూడా ఫాస్ట్ ట్రాక్లో పూర్తి చేసి 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని వెంకటేష్ భావిస్తున్నారట. ఈ వేగం నిజమైతే, అభిమానులకు తక్కువ గ్యాప్లోనే వరుసగా డబుల్ ట్రీట్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.
