ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది కృతిశెట్టి. మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులను బద్ధలు కొట్టాడు. దర్శకుడు బుచ్చిబాబుకి ఉప్పెన మొదటి సినిమా. ఆయన కూడా ఊహించని సక్సెస్ను ఈ మూవీతో అందుకున్నాడు. అయితే, దర్శకుడికి రెండవ సినిమా ఛాన్స్ రావడానికి, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టింది.

కానీ, హీరో హీరోయిన్స్ కి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టికి వచ్చినన్ని అవకాశాలు మరో కొత్త అమ్మాయికి రాలేదంటే, దాన్నే లక్ అంటారు. కానీ, ఆ లక్ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది ఈ సొట్టబుగ్గల చిన్నది. నాగ చైతన్య, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో హీరోయిన్గా నటించి హిట్ అందుకుంది. మొత్తంగా కృతి కెరీర్ లో నిలిచిన హిట్ సినిమాలు రెండే.
నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేని సరసన నటించిన ది వారియర్, నాని సరసన నటించిన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు తో చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మరోసారి నాగ చైతన్యతో చేసిన కస్టడీ..ఇలా తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ అని ఒప్పుకున్న సినిమాలు గట్టి షాకిచ్చాయి. ఈ సినిమాలు గనక హిట్ అయి ఉంటే ఇప్పుడు కృతి రేంజ్ మరోలా ఉండేది. కానీ, ఊహించని షాకులు తగిలి తెలుగు తెరకి దూరమైంది. మలయాళంలో చేసిన సినిమా కూడా కలిసి రాలేదు.

ఇటీవల వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డిజాస్టర్ టాక్తో కృతికి షాకిచ్చింది. ఈ మూవీతోనైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకుంటే ఫ్లాపై కృతి కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. అయితే, ఇంకా ఎక్కడో అమ్మడికి లక్ ఫేవర్ చేస్తోంది. అందుకే, వరుస సక్సెస్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాను తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్ మూవీలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఛాన్స్ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నాడు. కీర్త్ సురేష్ వెంకీకి జతగా ఎంపికైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నుంచి మొదలై నాన్ స్టాప్ గా జరపనున్నారు. ఎప్పటిలాగే, మళ్ళీ 2027 సంక్రాంతికి అనిల్ వెంకీ, కళ్యాణ్ రామ్ లతో రావడానికి రెడీ అవుతున్నాడు. మరి, ఈ మూవీతోనైన కృతి శెట్టి హిట్ అందుకొని లైం లైట్ లోకి వస్తుందా లేదా చూడాలి.






