ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా, రాషా తడాని హీరోయిన్గా పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ లవ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది.
5 భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్టు 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఆడియోలను అందుబాటులో ఉంచనున్నారు. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇక ఓటీటీలో వీక్షించే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సమర్పణలో సి.కె. పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్, గుళ్లపల్లి కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
థియేట్రికల్ రన్ అనంతరం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ‘శ్రీనివాస మంగాపురం’ సిద్ధమైంది. రేపటి నుంచి ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడవచ్చు.






