దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ Varanasi. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో మేకర్స్ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సుమారు రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ ఆశిస్తున్న మొత్తానికి ఈ ఆఫర్కు గణనీయమైన వ్యత్యాసం ఉండటంతో ప్రస్తుతం ఓటీటీ డీల్ను ఫైనల్ చేయకుండా చర్చలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో అంతర్జాతీయ స్టూడియోలతో కూడా చిత్ర బృందం పలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆ చర్చలు ఆశించిన స్థాయిలో ఫలించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ‘వారణాసి’ టీమ్ మాత్రం ఎలాంటి ఆర్థిక ఒత్తిడికి లోనవ్వడం లేదని సమాచారం.
రాజమౌళికి భారీ సినిమాలను మార్కెట్ చేయడంలో ఉన్న అనుభవం, ఆయన సినిమాలపై ఉన్న క్రేజ్పై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారట. సరైన సమయంలో డిజిటల్, ఇతర హక్కులకు సంబంధించిన డీల్స్ను మరింత మెరుగైన ధరకు కుదుర్చుకోగలమనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్ర బృందం ఓటీటీ చర్చల కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. భారీ విజువల్స్, గ్రాఫిక్స్తో రూపొందుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కీలకంగా మారడంతో, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ‘వారణాసి’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ హక్కులను తొందరపడి తక్కువ మొత్తానికి విక్రయించకుండా, సరైన సమయంలో భారీ డీల్ను సెట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా బిజినెస్ డీల్స్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





