భార్యని హత్య చేసిన భర్త

భార్యని హత్య చేసిన భర్త

వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు హత్య చేసి నేరస్తులుగా మారుతుంటే.. మరికొందరు విషయం బయటకు పొక్కి పరువు పోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది.

యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గేట్ సమీపంలో పవన్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి పడేశారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే ఈ హత్య కేసులో మల్లప్ప అనే వ్యక్తిని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య చేసినట్లు మల్లప్ప పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

నిందితుడు కురువ మల్లప్ప భార్యకు, బూరుగుపల్లి పవన్‌కు మధ్య గత కొన్నేండ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయమై మల్లప్ప ఎన్నో సార్లు చెప్పి చూసినా వారిద్దరూ మారలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన మల్లప్ప పవన్‌ను హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్య నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. భద్రతా సమస్యలు రాకుండా పోలీసులు చూసుకుంటున్నారు.