భార్యతో గొడవపడి రైలుకి బండి అడ్డం పెట్టి ?

భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి నేరుగా రైల్వే ట్రాక్‌ మీదకి వెళ్లి తన బైక్‌ తో సహా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే రైలు డ్రైవర్ సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌ (26)కు శుక్రవారం భార్యతో పెద్ద గొడవైంది. దీంతో మనస్తాపం చెందిన షణ్ముగవేల్ తన బైక్‌పై నేరుగా తురుభువనం చేరుకుని లాడనేందల్‌ రైల్వే వంతెన కింద మద్యం తాగి అక్కడే నిద్రపోయాడు. ఉదయం చనిపోవాలని నిర్ణయించుకుని బైకును తీసుకెళ్లి పట్టాలపై అడ్డంగా పెట్టి దానిపైనే కూర్చున్నాడు. అదే సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు లోకోపైలట్ పట్టాలపై బైక్ ఉన్న విషయాన్ని దూరం నుంచే గుర్తించి రైలును నిలిపివేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిందికి దిగిన ప్రయాణికులు పట్టాలపై బైక్‌పై కూర్చున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయారు. బైక్ తీయమని ఎంతగా మొత్తుకున్నా షణ్ముగవేల్ వినిపించుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు బైకు నంబర్ ద్వారా అతను షణ్ముగవేల్ అని కనిపెట్టి అతని కోసం గాలిస్తున్నారు.భార్యతో గొడవపడి రైలుకి బండి అడ్డం పెట్టి ?
భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి నేరుగా రైల్వే ట్రాక్‌ మీదకి వెళ్లి తన బైక్‌ తో సహా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే రైలు డ్రైవర్ సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌ (26)కు శుక్రవారం భార్యతో పెద్ద గొడవైంది. దీంతో మనస్తాపం చెందిన షణ్ముగవేల్ తన బైక్‌పై నేరుగా తురుభువనం చేరుకుని లాడనేందల్‌ రైల్వే వంతెన కింద మద్యం తాగి అక్కడే నిద్రపోయాడు. ఉదయం చనిపోవాలని నిర్ణయించుకుని బైకును తీసుకెళ్లి పట్టాలపై అడ్డంగా పెట్టి దానిపైనే కూర్చున్నాడు. అదే సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు లోకోపైలట్ పట్టాలపై బైక్ ఉన్న విషయాన్ని దూరం నుంచే గుర్తించి రైలును నిలిపివేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిందికి దిగిన ప్రయాణికులు పట్టాలపై బైక్‌పై కూర్చున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయారు. బైక్ తీయమని ఎంతగా మొత్తుకున్నా షణ్ముగవేల్ వినిపించుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు బైకు నంబర్ ద్వారా అతను షణ్ముగవేల్ అని కనిపెట్టి అతని కోసం గాలిస్తున్నారు.