భర్త ఉండగానే చనిపోయాడని చెప్పి పెళ్లి !

married woman second marriage fake death certificate karnataka

భర్త ఉండగానే చనిపోనట్లు నకిలీ ధ్రువీకరణపత్రం తయారు చేసిన ఓ కిలాడీ లేడీ మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. బెంగుళూరులో వెలుగు చూసిన ఈ ఉదంతం కుమారస్వామి లేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. నగరానికి చెందిన నాగరాజ్‌ అనే వ్యక్తి ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల నాగరాజ్‌ భార్య మృతిచెందడంతో మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ సమయంలో చిక్కబళ్లాపుర నివాసి వెంకటలక్షి పరిచయమైంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలో తన భర్త 1990లో మృతి చెందినట్లు వెంకటలక్ష్మి చిక్కబళ్లాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో ధ్రవీకరణపత్రం తీసుకుంది. వివాహమైన కొద్ది రోజుల్లోనే వెంకటలక్ష్మి నాగరాజ్‌ కట్టిన బంగారు మంగళసూత్రం తో పాటు ఇతర బంగారుఆభరణాలు విక్రయించింది. దీంతో అనుమానపడిన నాగరాజ్‌ చిక్కబళ్లాపుర తహశీల్దార్‌ కార్యాలయంలో విచారించగా వెంకటలక్ష్మీ భర్త బతికి ఉన్నట్లు తెలిసింది. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న నాగరాజ్‌ శుక్రవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.