విద్యార్థులను సిద్ధం చేస్తున్న మైక్రోసాఫ్ట్‌

విద్యార్థులను సిద్ధం చేస్తున్న మైక్రోసాఫ్ట్‌

సాంకేతిక నైపుణ్యాలు, ఉపాది అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడంకోసం మైక్రోసాఫ్ట్‌, ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌ వర్చువల్‌ ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంను లాంచ్‌ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్‌ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చును. మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్‌ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చును. ఈ ప్రోగాంలో 2021 గ్రాడ్యుయేషన్‌ పూర్తైన విద్యార్థులు పాల్గొనవచ్చును. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్‌ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు మైక్రోసాఫ్ట్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదైనా స్పెషలైజేషన్‌ను కల్గిన విద్యార్థులు ఈ ప్రోగాంకు దరఖాస్తు చేసుకోవచ్చుని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

ఫ్యూచర్ రెడీ టాలెంట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్‌లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది.