ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామిపై మిడ్ నైట్ అటాక్

ముంబైలో అర్థరాత్రి విధులు ముగించుకొని భార్యతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కొంచం దూరం వారిపై దాడికి దిగారు. కారుపై రక్తం మరకలు కూడా కనిపిస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. రిపబ్లిక్‌ టీవీ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్ట్ అయిన అర్నాబ్‌ గోస్వామి అతని భార్యపై దాడి జరిగడంతో షాక్ కు గురయ్యారు. ముంబైలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన ఆర్నాబ్ వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో వారిద్దరికీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. కారుపై, కారు అద్దాలపై రక్తం మరకలు పడిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే దాడికి ఎవరు పాల్పడ్డారు అనేదానిపై విచారణ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే దాడితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద అంటే.. సెక్షన్ 504, 341 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు రెండు రోజుల క్రితం అర్నాబ్ గోస్వామి రిజైన్ చేశారు. టీవీ చానెల్‌ లైవ్‌ లో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ఎడిటర్స్‌ గిల్డ్‌లో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ.. తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై మూకదాడి ఘటనపై తన టీవీలో లైవ్‌ చర్చా కార్యక్రమం నిర్వహిస్తూనే.. అర్నబ్‌ తన రిజైన్ ను ప్రకటించారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు శేఖర్‌ గుప్తా స్పందించక పోవడంపై ఆయన ప్రశ్నించారు. ‘పాల్‌ఘర్‌ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే.. మరో వర్గం వ్యక్తి దాడికి గురయ్యుంటే నసీరుద్దీన్‌ షా, అపర్ణా సేన్‌, అనురాగ్‌ కశ్య్‌ప లాంటి వాళ్లంతా ధ్వజమెత్తేవారు’ అంటూ అర్నబ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.