రైతులకి మోదీ సర్కార్ మద్దతు

రైతులకి మోదీ సర్కార్ మద్దతు

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థిక మద్దుతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO కూడా ఒకటి. ఇందులో చేరితే కేంద్రం రూ.15 లక్షల రుణం అందిస్తుంది.

ఈ స్కీమ్ కింద రైతులు అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మోదీ సర్కార్ రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. అయితే ఈ పథకంలో సులభంగా ఎలా చేరాలో, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలానో స్పష్టంగా తెలియడం లేదు.

ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ స్కీమ్ కింద రూ.15 లక్షలు పొందాలంటే.. 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాలి. కంపెనీ చట్టం కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత దీని ద్వారా విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర ఎక్విప్‌మెంట్లు రైతులకు విక్రయించొచ్చు.

ఇకపోతే కేంద్రం 2023-24 నాటికి 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించొచ్చు.