అమ్మకు బాగలేదని ఇంటికి పిలిచి.. అక్కలను నరికి చంపేశాడు..

హైదరాబాద్‌లో తాజాగా దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది సొంత అక్కలనే పొట్టన పెట్టుకున్నాడు. అక్కలను చంపేందుకు ముందుగానే ప్లాన్ వేసుకున్న అతడు.. అమ్మకు బాగలేదని వచ్చి చూడాలని పిలిచి కత్తితో పొడిచేశాడు. ఈ దారుణమైన ఘటనలో ఇద్దరు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మరొక ఆమె పరిస్థితి పూర్తిగా విషమించింది. అసలేం జరిగింది అంటే.. పోలీసుల తెల్పిన వివరాల ప్రకరం… చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాలాకు చెందిన అహ్మద్ ఇస్మాయిల్ ఒకప్పుడు బౌన్సర్ గా పనిచేసే వాడు. ఇప్పుడు తల్లితో కలిసి నివసిస్తున్న ఇస్మాయిల్ తల్లికి ఆరోగ్యం బాగాలేదని, వెంటనే రావాలని నలుగురు అక్కలకు చెప్పాడు. నిన్న ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చిన అక్కలు రజియాబేగం, జకీరాబేగంలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే అక్కడ అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బావపై కూడా దాడి చేసి పరారు అయ్యాడు. వెంటనే విషయం తెలుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారించారు.

కాగా అప్పటికే రజియా బేగం మృతి చెందింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జకీరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఆసుపత్రికి తరలించారు. జకీరాబేగం మాత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా… మృత్యువాత పడింది. నాలుగో అక్క మలికా బేగంను చంపాలని ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆమెను వేరే చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారని తెలుసుకొని వారి మీద దాడి చేసేందుకు ఓవైసీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న పోలీసులను చూసి వెనక్కి తగ్గాడు. అయితే అతనికి అక్కడ దారిలో బంధువు కనిపించాగా.. వారితో కీలకమైన విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అదేమంటే.. తన అక్కలు చెప్పడం మూలంగానే తాను భార్యను చంపేశానని.. అందుకు ప్రతీకారం తీర్చుకొనేందుకే ఇలా అక్కలకు చంపేస్తున్నాని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మొన్న ఆదివారం ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు కలుసుకున్నారని.. ఆ తర్వాతే నిందితుడు హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపట్టారు.