నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి(69) మంగళవారం రాత్రి కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏప్రిల్ 3 నుంచి కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు. కొన్నాళ్లకు టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి నంద్యాల సీటు ఆశించి భంగపడ్డ ఆయన ఎట్టకేలకు జనసేనలో చేరారు.