మోడీ నెమ్మదిగా 15 లక్షలు ఇస్తారట…!

Pm Narendra Modi Andhra Pradesh Tour May Be Postponed

ఎన్నికల సమయంలో ఎన్నో చెబుతాం, అన్నీ చేయడం సాధ్యం అవుతుందా ? అది కూడా అలాంటిదే అని భారతీయ జనతా పార్టీకి మోడీకి ఎదురు లేదని భావిస్తున్న సమయంలో అమిత్ షా నోటి వెంట దాదాపుగా ఏడాది క్రితం వచ్చిన ఈ మాటలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ మాట అన్నది బ్లాక్ మనీ తెస్తాం ప్రతి ఒక్కరికీ రూ. 15 లక్షలు ఇస్తామని మోడీ ఇచ్చిన హామీ గురించి. అప్పటి నుంచి బీజేపీ నేతలు చెప్పేవాటిని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేయడంతో బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు కూడా ఎలాగోలా గట్టెక్కడానికి చూస్తున్నారు. ఆ పదిహేను లక్షల టాపిక్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆ మొత్తం ఒక్క సారే కాదు.. కొద్దికొద్దిగా అయినా మోడీ ఇస్తారంటూ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన రాందాస్ అథవాలే బీజేపీ నేత కాదు. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు. ఆ పార్టీ తరపున ఆయన తప్ప మరొక ఎంపీ లేరు. ఒకే ఒక్క ఎంపీ ఉన్న పార్టీ అయినప్పటికీ ఆయన కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అందుకే ఆయన మోడీని తెగ మోసేస్తూంటారు. ఈ క్రమంలో ఎన్నికల హామీల అమలు విషయంలో మోడీ చేతకాని తనాన్ని పక్క వాళ్లపై నెట్టేయడానికి బీజేపీ నేతల కన్నా ఎక్కువగా తాపత్రయ పడుతున్నారు. రూ. 15 లక్షలు మోడీ ఇద్దామనుకున్నా ఆర్బీఐ ఒప్పుకోలేదని అంటున్నారు. ఆర్బీఐ వద్ద ఉన్న డబ్బులు ఇస్తేనే కదా మోడీ పంచేది అంటున్నరు. అంటే ఆర్బీఐ వద్ద రిజర్వ్ ఉన్న నిధుల్ని మోడీ పంచాలనుకున్నారు అందుకు ఆర్బీఐ అంగీకరించలేదన్నమాట. అందుకే మోడీ ఇవ్వలేదని కొద్దికొద్దిగా ఇస్తారని కూడా కవర్ చేసుకుంటున్నారు.