ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,266 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,94,855 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,935కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,37,651 శాంపిల్స్‌ను పరీక్షించారు.  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.