ఎల్లారెడ్డిగూడ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ !

రెండురోజుల క్రితం సంచలనం స‌ృష్టించిన ఎస్సార్ నగర్ లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన మహిళ హత్యకేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. తన తల్లి వ్యాపారాల నిమిత్తం అప్పులు చేసి అప్పుల వాళ్ళు ఇంటిమీదకి రావడంతోనే ఆమెని హత్య చేసానని నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోగా ఇప్పుడు ఆ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే జల్సాలకు అలవాటు పడిన కొడుకు మదన్ కి తల్లి మమత అప్పులు చేసి మరీ జల్సాలకు డబ్బులు ఇచ్చింది. ఆ విధంగా మదన్ తన తల్లి మమత దగ్గర నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో బాగా జల్సాలు చేశాడు. చిట్టీలు కట్టినవారు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తేవడంతో తీసుకున్న డబ్బులు ఇవ్వమని మమత కుమారుడిని అడగడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మదన్ తల్లిని దారుణంగా కొట్టి.. హత్య చేశారు. చిట్టీ వాళ్ల గొడవలకు తట్టుకోలేకే తల్లిని హత్య చేశానని మదన్ మొదట చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే అసలు విషయాన్ని బయటపెట్టాడు.