ప్రముఖ క్రికెటర్ కి ‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

ప్రముఖ క్రికెటర్ కి ‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల అనారోగ్యంతో బాధపడుతున్నఅతనికి శనివారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అఫ్రిది స్వయంగా వెల్లడించారు. కాగా పాకిస్తాన్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1 లక్షా 32 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 2600కి చేరింది.