పంతం జులై 5 విడుదల

`ఆంధ్రుడు`, `య‌జ్ఞం`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం` వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ మ్యచో స్టార్ గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పై పంతం సినిమా విడుదలకి సిద్దమయ్యింది. ఇది గోపీచంద్ కి  25వ చిత్రం కావ‌డం విశేషం. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 5న విడుదలకు సిద్ధమైంది.

చిత్రానికి సంబందించిన క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు

నటీ నటులు : గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు
ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌
డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి
స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌),
మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌,
సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌,
నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌,
స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).