హాజీ పూర్ మానవ మృగం…రేప్ చేసి…బావిలో పాతేయడమే ?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న హాఫీజ్‌పూర్‌ అమ్మాయిల హత్యల విషయమై విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి, మనీషాలను రేప్ చేసి చంపేసి బావిలో పూడ్చిన శ్రీనివాస్ రెడ్డి గురించి పోలీసులు షాకిచ్చే విషయాలను వెల్లడించారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చే అమ్మాయిలను శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా చేసుకునే వాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మండల కేంద్రమైన బొమ్మల రామారం నుంచి హాఫీజ్‌‌పూర్ గ్రామం 15 కి.మీ. దూరంలో ఉండటం, ఊరికి బస్సు సౌకర్యం సరిగా లేకపోవడం నిందితుడికి కలిసి రాగా, అమ్మాయిల పాలిట శాపంగా మారిందని తెలుస్తోంది. బస్సులు సరిగా లేకపోవడంతో చదువు కోసం బొమ్మలరామారం వచ్చిన వాళ్లు.. ఊరికి తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ అడిగేవారు. దీన్ని ఆసరగా చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి ముందే అమ్మాయిలను టార్గెట్ చేసుకుని వారికి తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చేవాడు. అమ్మాయిలు వెళ్లే టైంకే తను వెళ్తూ.. ఏదో పని మీద వెళ్తున్నట్టుగా నమ్మించే వాడు. ఇలా నమ్మకం కుదిరేలా కొన్నిసార్లు లిఫ్ట్ ఇచ్చాక.. వారిని రేప్ చేసి, హత్య చేసేవాడు. అనంతరం తన పొలంలోని నీళ్లు లేని బావిలో పూడ్చి పెట్టేవాడు. ఇలాగే మనీషాను శివరాత్రి రోజు చంపేశాడు. మనీషా తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు కాగా.. పెద్ద కూతురు మినహా ఇద్దరు కుమార్తెలు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో చిన్న కూతురైన మనీషా కూడా ఇష్టపడిన వ్యక్తితో వెళ్లిపోయి ఉంటుందని ఆమె తండ్రి భావించారు. పరువు పోతుందనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. తన కూతురు ఎక్కడైనా బతికే ఉంటుందని భావించిన ఆ తండ్రి.. తన బిడ్డ ఇక లేదనే వార్త తెలిసి హతాశుయ్యాడు. పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అన్ని విషయాలను వెల్లడించాడు. కల్పన, మనీషా, శ్రావణిను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. 2015లో 15 ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేశానని శ్రీనివాసరెడ్డి పోలీసులకు తెలిపాడు. నెలన్నర క్రితం డిగ్రీ చదువుతున్న మనీషాను రేప్ చేసి చంపేశానని చెప్పాడు. ఈ నెల 25వ తేదీన స్కూల్ నుంచి వస్తున్న శ్రావణిపై అత్యాచారం చేశానని, ఆ తర్వాత హత్య చేశానని తెలిపాడు. ముగ్గురునీ పాడుపడిన బావిలో పాతిపెట్టానని చెప్పారు. కర్నూలులో కూడా ఒ మహిళపై హత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వరంగల్ లో మరో మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.