రకుల్‌ స్థానంపై కన్నేసింది

pooja hedge competition for rakhul preet sing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pooja Hedge Competition TO Rakhul Preet Singh

గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోల మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అతి తక్కువ గ్యాప్‌లోనే మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, రవితేజ వంటి హీరోల సరసన నటించింది. ఈమెతో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు క్యూ కట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. రకుల్‌ క్రేజ్‌ తగ్గింది. ఆమెకు అడపా దడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. రకుల్‌ స్థానంను ఇప్పుడు పూజా హెగ్డే ఆక్రమించేందుకు సిద్దంగా ఉంది.

‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌ వెళ్లి పోయిన పూజా మళ్లీ ‘డీజే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘డీజే’ చిత్రంలో ఈ అమ్మడు పోషించిన పాత్ర మరియు అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దాంతో ఈమెకు విపరీతమైన క్రేజ్‌ దక్కింది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కబోతున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా కోటి రూపాయల పారితోషికం ఇచ్చి మరీ ఈమెను బుక్‌ చేయడం జరిగింది. ఇక పలువురు స్టార్‌ హీరోలు కూడా ఈమె వైపు ఆసక్తిగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రకుల్‌ క్రేజ్‌ తగ్గడం, అదే సమయంలో పూజా ఎంట్రీ ఇవ్వడంతో కలిసి వచ్చే అంశం.

మరిన్ని  వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

ముగ్గురిలో ఒకరు కాదు.. ముగ్గురు!

ఇది పక్కా వైఎస్‌ జగన్‌ స్టోరీ