రోజు రోజుకు తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

రోజు రోజుకు తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు ఒక్కరోజే 985 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి నేడు మరో 7 మంది చనిపోయారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 774 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 86 కేసులు, మేడ్చల్‌లో 53 కేసులు, వరంగల్ అర్బన్‌లో 20 కేసులు, మెదక్‌లో 9 కేసులు, అదిలాబాద్‌లో 7 కేసులు, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌లో 6 చొప్పున కేసులు, సిద్దిపేట, భూపాలపల్లి, ఖమ్మంలో మూడేసి కేసులు, ములుగు, జగిత్యాల, యాదాద్రిలో రెండేసి కేసులు, వికారాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 4,766 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 7,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 237కి చేరింది.