పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా అమరావతి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల స్పందించిన వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రాజధాని అమరావతిలో రైతుల పేరు చెప్పి ఆందోళనలు చేస్తుంది పెయిడ్ ఆర్టిస్టులేనని, రైతుల పేరుతో కార్పోరేట్ ఉద్యమం నడుస్తోందని నిజంగా ధర్నాలు చేసేది రైతులే అయితే వారికి ఆడి కార్లు, మహిళలకు బంగారు గాజులు ఎలా వస్తాయని పృథ్వీ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్ధాని మహిళలు, రైతులు పృథ్వీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మహిళలు ఆయన దిష్టబొమ్మను చెప్పులతో కొడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. రైతులను కించపరిచిన పృథ్వీరాజ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.