ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

సూర్యాపేట శివారు దురాజ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మందితీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.