గుండెలు బరువెక్కించే ప్రోమో.. ప్రశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు ఏంటి?

గుండెలు బరువెక్కించే ప్రోమో.. ప్రశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు ఏంటి?
Cinema News, Entertainment

బిగ్‏బాస్ హౌస్‏లో వారం రోజులుగా ఎమోషనల్ సీన్స్ చూస్తున్నాము. ఫ్యామిలీ వీక్‏లో ఒక్కొక్కరి కుటుంబసభ్యులు హౌస్‏లోకి వస్తుండడంతో సంతోషంతోపాటు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే యావర్, శోభాశెట్టి, శివాజీ, అమర్ దీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, భోలే ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చారు .. తమ ఇంటి వాళ్లను చూడగానే తెగ సంబరపడిపోయారు . ఇక ఈరోజు పల్లవి ప్రశాంత్, రతిక కుటుంబసభ్యులు ఇంట్లోకి వస్తున్నారు . తాజాగా పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్‏లోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ముందుగా ప్రశాంత్ కోసం బంతిపూలను పంపించారు బిగ్‏బాస్. వాటిని చేతిలో పట్టుకుని చాలా రోజులు అవుతుంది అని ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ఆ తర్వాత బాపు బంగారం అంటూ చేతిలో బంతిపూలతో బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్ తండ్రి.

Video : https://youtu.be/oGcY65LEPCw

ఇక తండ్రిని చూడగానే కాళ్లపై పడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. కొడుకును కౌగిలించుకుని నిన్ను చూడక ఎన్ని దినాలైంది బిడ్డా అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్ తండ్రి. మా బాపు బిగ్ బాస్‌లోకి వచ్చాడంటూ.. తండ్రిని ఎత్తుకుని అరుస్తూ సంతోషపడిపోయాడు. తగ్గేదే లేదు బిడ్డా అంటూ ప్రశాంత్ తండ్రి చెప్పడం హైలెట్ అయ్యింది. . ఆ తర్వాత వారిద్దరి దగ్గరకు శివాజీ రాగా.. నా కొడుకును కన్న కొడుకులాగా చూసుకున్నారు అని అంటూ దండం పెట్టాడు ప్రశాంత్ ఫాదర్. ఇంట్లో ఒక్కొక్కరిని పలకరిస్తూ.. అందరూ కలిసిమెలిసి ఉండండి.. కొట్లాడుకోకండి అని చెప్పాడు .

For More details Please Subscribe Our Channel:

TeluguBullet : https://www.youtube.com/@TeluguBullet