ఎవరిని వదిలిపెట్టను అంటున్న రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ పై దాడి చేసిన వారిని గాలిస్తున్న పోలీసులు

తనను ఒక్కడ్ని చేసి టార్గెట్ చేసి బీర్ బాటిల్స్‌తో ఎటాక్ చేసినవారిని అస్సలు వదిలిపెట్టను అంటున్నారు ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. ఇప్పటికే ఈ ఎటాక్ విషయంపై నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసారు రాహుల్. .

‘‘బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫ్రెండ్స్‌కి పార్టీలు అవీ ఇవ్వాలని అనుకున్నా. కానీ మొన్న పబ్‌లో జరిగిన గొడవ తర్వాత నేనే అమ్మాయిల్ని వేసుకుని వెళ్లాను కాబట్టి నేనే వాళ్లని గెలికాను అనుకుంటున్నారు. నేను ఎవ్వరి జోలికీ వెళ్లను. కానీ మొన్న మాత్రం పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని నేను ఒక్కడినే ఉన్నానని నన్ను టార్గెట్ చేసారు. నేను ఏమీ అడగటంలేదు. నాకు న్యాయం కావాలి. తప్పు నాదైతే పడ్తా. తప్పు నాది కానప్పుడు నన్ను గెలికితే నేను ఎందుకు ఊరుకుంటా. మీ చిచ్చాకి న్యాయం జరగాలిరా. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేను సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు ఇచ్చినా”

“కానీ మీ వరకు రాలే. అందుకే నేనే పోస్ట్ చేస్తున్నా. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటివి జరిగితే బాగోదు. నాతో పాటు ఐదుగురే ఉన్నారు. వారితో పాటు మరో ముగ్గురు ఉంటే మజా ఉండేది. వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. వాళ్లకు సిగ్గు అనిపించాలి. బ్యాగ్రౌండ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఎక్కడపడితే అక్కడ చూపిస్తే బాగోదు. వాడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే. అమ్మతోడు నేను ఎవ్వరినీ వదలను. నాకు న్యాయం కావాల్సిందే. ఈ ఘటన ఎక్కడికి పోతుందో చూద్దాం’ అని తెలిపారు.