ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఇండియన్ రైల్వేకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. త్వరలోనే రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్‌ను ప్రభుత్వం అందించనున్నట్టు తెలుస్తోంది. నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలను మార్చిన తర్వాత.. బేసిక్ వేతనం రూ.43,600కి పైగా ఉన్న వారికి నైట్ డ్యూటీ అలవెన్స్‌ను ఇవ్వడం లేదు. కానీ ప్రస్తుతం ఈ అలవెన్స్‌ను వీరికి కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇష్యూను త్వరగా పరిష్కరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖకు అభ్యర్థన పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఇష్యూ ఆర్థిక మంత్రిత్వ శాఖ టేబుల్‌పై ఉంది. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం, త్వరలోనే దీనిపై ఒక పాజిటివ్ నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.

బేసిక్ వేతనం రూ.43,600కి పైన ఉన్న ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ ఆపివేయడంతో.. 3 లక్షల మందికి పైగా రైల్వే ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపుతోంది. నైట్ డ్యూటీ అలవెన్స్‌ను రాత్రి పూట రైళ్లు నడిపే డ్రైవర్లకు, ఆపరేటర్లకు, నిర్వహణ కూలీలకు ఇస్తారు. ఈ ఆర్డర్ తర్వాత రైల్వే ఉద్యోగులపై ప్రభావం పడుతుందని.. వారి ప్రయోజనాలు కాపాడేందుకు నైట్ డ్యూటీ అలవెన్స్‌ను మళ్లీ వారికి ఇవ్వాల్సిందేనని భారతీయ రైల్వే కోరుతోంది.రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవలే ఈ ఇష్యూను టేకప్ చేసి, రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపింది.

బోర్డు ఆమోదం కోసం, ఎక్స్‌పెండించర్ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనను స్వీకరించినట్టు రైల్వే బోర్డు సెక్రటరీ తెలిపారు. ఆఫీసు మెమోరాండం ద్వారా ఈ ప్రతిపాదనను పంపినట్టు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం వెలువడుతుందని, నైట్ డ్యూటీ అలవెన్స్ జారీ చేస్తూ ఆర్డర్లు వెలువడతాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై రైల్వే సిబ్బంది మంత్రిత్వ శాఖపై, వాటి సంబంధిత సంస్థలపై ఒత్తిడి పెడుతున్నారని, దీంతో రైల్వే బోర్డు ఎప్పటికప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతుందని, త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఉన్నత స్థాయి అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆదేశాలను జారీ చేస్తారని కూడా పేర్కొన్నాయి.