తల్లి పాత్రలతో కూడా క్రేజ్ సంపాదిస్తున్న ప్రముఖ నటి

తల్లి పాత్రలతో కూడా క్రేజ్ సంపాదిస్తున్న ప్రముఖ నటి

నాటి హీరోయిన్లంతా నేడు తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణ ఇదే కోవలో ఎప్పుడో రీఎంట్రీ ఇచ్చేసినా ఆమె కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన సినిమాగా బాహుబలి నిలుస్తుంది. దీని తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులోనే తీరిక లేనంతగా షూటింగ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తోంది.

ఇటీవలే భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే రీమేక్ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రకు ఎంపికైంది. ఇది కాకుండా నాగార్జునతో బంగార్రాజు చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానుంది. ఇక నాగార్జునతోనే ఆమె మరో చిత్రం కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

హిందీ సూపర్ హిట్ చిత్రం రైడ్ ను రీమేక్ చేయాలని నాగ్ భావిస్తున్నాడు. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. రమ్యకృష్ణ కూడా కథ విని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇలా లేటు వయసులో కూడా రమ్యకృష్ణ మంచి ఆఫర్లను బుట్టలో వేసుకుని దూసుకుపోతోంది.