ప్రీ రిలీజ్ వేడుకకు అతిదిగా హాజరైన రేణుదేశాయ్

ప్రీ రిలీజ్ వేడుకకు అతిదిగా హాజరైన రేణుదేశాయ్

రేణుదేశాయ్ చాల కాలంగా సినిమాలకు దూరంగా వున్నారు. అయితే తాజాగా చూసి చూడంగానే చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అతిది గా హాజరయ్యారు. అయితే అనంత శ్రీరాం, చిన్మయి కలిసి పని చేసిన పాటని లాంచ్ చేసి పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. రాజ్ కందుకూరి ఈ సినిమా ని నిర్మించారు. చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులు, టెక్నిషియన్లు రావాలి, వారికీ చిత్ర పరిశ్రమలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవాలని అన్నారు. ఏ ఫిమేల్ టెక్నిషియన్ అయినా రాజ్ కందుకూరి తో పని చేస్తే చాల సేఫ్ గా వుంటారు అని నేను గర్వంగా చెప్పగలను అని రేణు దేశాయ్ అన్నారు.

అయితే ఈ చిత్రం లో నటించేందుకు రాజ్ కందుకూరి అవకాశం ఇచ్చారని, కానీ ఒంట్లో బాగోలేకపోవడం వలన నటించలేకపోయారని తెలిపారు. ఆ పాత్ర కూడా ఏంటో తెలీదని కానీ రాజు గారు నిర్మాత అనగానే ఓకే చెపుదామని అనుకున్న అని అన్నారు. ఆయనతో ఉన్నపుడు నేను సేఫ్ గా వుంటాను అని రేణు దేశాయ్ అన్నారు. అలాంటి నిర్మాతలు మన ఇండస్ట్రీ కి చాల అవసరం అని అన్నారు. ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పగలను, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.