ట్విటర్లో భావోద్వేగ ట్వీట్ చేసిన రితేష్ దేశముఖ్

ట్విటర్లో భావోద్వేగ ట్వీట్ చేసిన రితేష్ దేశముఖ్

లాతూర్‌ జిల్లా నుంచి  మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారులు అజిత్‌ దేశ్‌ముఖ్, ధీరజ్‌ దేశ్‌ముఖ్‌లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ మరో కుమారుడు బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌  ఈ సందర్భంగా “నాన్న మేము సాధించాం, 40వేల మెజార్టీతో మూడసారి వరుసగా అమిత్‌ లాతూర్ సిటీలో గెలుపు పొంది లక్షా 20వేల భారీ మెజార్టీతో ధీరజ్‌ లాతూర్‌ రూరల్‌ అసెంబ్లీ స్థానంలో గెలిచాడు. మాపై ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి లాతూర్‌ ప్రజలకి ట్వీట్ ద్వారా ధన్య వాదాలు తెలియచేశాడు.

ప్రణతి షిండే మాజీమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే కూతురు ఇంకా మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు నితేష్‌ రాణే కూడా గెలుపొందారు. శివసేన అధ్యక్షులు, శివసేన అధినేత దివంగత బాల్‌ ఠాక్రే మనవడు అయిన ఆదిత్యఠాక్రే ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గంనుండి 67,427ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ కుమారుడు ధీరజ్‌ దేశ్‌ముఖ్‌ లాతూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో “నోటా” ద్వితీయ స్థానంలో ఉండి ప్రత్యర్థులైన శివసేన అభ్యర్థి సచిన్‌ అలియాస్‌ రవి దేశ్‌ముఖ్‌ విజయం సాదించలేక పోయాడు. ఇలా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాదించి పలువురు రాజకీయ వారసులు శాసన సభలో అడుగుపెట్టబోతున్నారు.