గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం దగ్గర అర్ధరాత్రి కంటైనర్ లారీ కారును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఇద్దరు చనిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

నలుగురు యువకులు గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే తిమ్మాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం(26) నరసరావుపేటలోని పనసతోటకు చెందిన షేక్‌ ఫిరోజ్‌ అహ్మద్‌(35), శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన వింజమూరి హరికృష్ణ (27), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.