ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

ముంబైలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదర్‌ ప్రాంతంలో.. బస్సు,ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో.. రాజేంద్ర , కాశీరామ్‌ ధూరీ, తాహిర్‌ హుస్సెన్‌ , రూపాలి గైక్వాడ్‌, సుల్తాన్‌, శ్రావణి మోస్కీ, వైధేహి బామనీ , మాన్సూర్‌ ఆలీ  తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తేజస్వినీ ట్రావెల్‌ కు చెందిన బస్సు మారోల్‌ నుంచి పైడోనీకి వెళ్తుండగా దాదార్‌ వద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం.. డ్రైవర్‌ కండక్టర్‌తో సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.