రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు విద్యార్థులతో పాటు కారు డ్రైవర్‌ ఉన్నాడు.

రీట్‌ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. జైపూర్‌- ఢిల్లీ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.