నిజామాబాద్‌ జిల్లాలో రౌడీ మూకలు

నిజామాబాద్‌ జిల్లాలో రౌడీ మూకలు

నిజామాబాద్‌ జిల్లాలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్‌లోని రజాక్‌ టీ స్టాల్‌పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్‌, అనుచరులు దాడులకు తెగబడ్డారు. ఒక్కసారిగా నాలుగు, అదుగురు రౌడీలు రజాక్ హోటల్‌పై ఇనుప రాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్‌లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

పాత కక్షల నేపథ్యంలో రౌడీషీటర్, పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ ఇబ్బుతో పాటు అనుచరులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీ స్టాల్‌లోని వ్యక్తిని రోడ్డుపైకి లాక్కొచ్చి కిరాతకంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.