థ్యాంక్స్‌ చెప్పేందుకు రాలేదు సారీ

Samantha Say Sorry to Rangasthalam Team

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకు పోతుంది. కేవలం మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిందని, ఇంతటి విజయాన్ని ఇచ్చిన అభిమానులకు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో చిత్ర యూనిట్‌ సభ్యులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సమయంలో సమంత కనిపించక పోవడంతో కొందరు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సమంతకు ఈ చిత్రం మంచి పేరు తీసుకు వచ్చింది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి సమయంలో సమంత ఎందుకు రాలేదు అని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొనలేక పోతున్నాను అంటూ సమంత ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సమంత భర్త నాగచైతన్యతో కలిసి విదేశాల్లో విహార యాత్రలో పాల్గొంటుంది. అందుకే రంగస్థలం థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొనలేక పోతుంది. రంగస్థలంలో అవకాశం దక్కడం చాలా సంతోషంను కలిగించింది. మీతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ మీట్‌కు రాలేక పోతున్నందుకు క్షమించాలి, ఎంతో సంతోషంగా ఉన్న మిమ్ములను కలవలేక పోతున్నందుకు విచారంగా ఉంది అంటూ సమంత ట్వీట్‌ చేసింది. రంగస్థలం విజయంతో సమంత క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో రెండు మరియు తమిళంలో రెండు చిత్రాలు చేస్తూ ఉంది. త్వరలో భర్త నాగచైతన్యతో కలిసి ఒక చిత్రాన్ని ఈమె చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.