మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ సుందరి

మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ సుందరి

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని ఇటివలే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి. కీర్తి, కియారాలో, సూపర్ స్టార్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఇప్పుడు కొత్తగా మరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి సారా తెలుగులో యాక్ట్ చేయడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.

ఇక’గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాల టైం తీసుకున్నాడు. అయితే అంత టైం తీసుకున్నందుకు పరుశురామ్ కి భారీ ఆఫరే దక్కింది.మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. పరుశురామ్, మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లితో చేయాలనుకున్న సినిమాను కూడా మహేష్ లైన్ లో పెట్టారని.. కాకపోతే అది వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.