Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లి విశేషాల వార్తలకు తెరపడలేదు. తాజాగా పెళ్లిలో వధూవరులు ధరించిన దుస్తుల గురించి…ఆసక్తి కర విషయాలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనుష్క ధరించిన పెళ్లి లెహంగాను 67 మంది కళాకారులు 32 రోజుల పాటు శ్రమించి రూపొందించినట్టు సవ్యసాచిముఖర్జీ చెప్పారు.పేల్ పింక్ రంగు లెహంగాపై వింటేజ్ ఇంగ్లిష్ రంగులతో సిల్వర్-గోల్డ్ మెటల్ దారాన్ని ఉపయోగించి ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు.
ఇందులో ముత్యాలు, పూసలు గుచ్చామని చెప్పారు. అనుష్క ఆభరణాల కోసం అన్ కట్ డైమండ్స్ ఉపయోగించామని తెలిపారు. విరాట్ వేసుకున్న ఐవరీ రా సిల్క్ షేర్వాణిపై వింటేజ్ బనారసీ ప్యాటర్న్ ను చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు సవ్యసాచి ముఖర్జీ తెలిపారు. దుస్తుల డిజైన్ వివరాలు చెప్పారు వాటి ఖరీదు ఎంతో మాత్రం సవ్యసాచి వెల్లడించలేదు. చడీచప్పుడూ కాకుండా ఈ నెల 11న ఇటలీలో వివాహంచేసుకున్న విరుష్క మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నారు. ఈ నెల 21న ఢిల్లీలో, 26న ముంబైలో కొత్త జంట రెండు రిసెప్షన్లు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆహ్వానపత్రికలు కూడా అందజేశారు. ముంబైలో జరిగే రిసెప్షన్ కు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు తరలిరానున్నారు. రిసెప్షన్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత విరాట్ అనుష్క ను తీసుకుని టీమిండియా కంటే ముందే దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు.