లోయలో పడ్డ పాఠశాల బస్సు : ముగ్గురు మృతి

School bus fell down in valley

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిమ్లాకు సమీపంలోకి ఖలిని ఏరియాలో ఓ పాఠశాల బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.