టీ20:ధావన్‌ను అవమానించిన షమ్సీ

టీ20:ధావన్‌ను అవమానించిన షమ్సీ

ఈ వారంలో బెంగుళూరు జరిగిన టీ20 లో టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆటలో పరాజయం చూసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమై ఓటమి  చెంది దాంతో సిరీస్‌ 1-1తో సరిపెట్టుకుంది.

సోషల్‌ మీడియాలో చివరి టీ20లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా ఆటగాడు షమ్పీ తన షూ తీసి సెలబ్రేట్‌ చేసుకున్న విషయం వైరల్‌ అయింది. అందువల్ల కొంతమంది అభిమానులు ధావన్‌ను షమ్సీ అవమానించారని ట్రోల్‌ చేశారు.దీని వల్ల షమ్పీ ధావన్‌ను తానేమీ అగౌరవపరచలేదని చెప్పాడు.

కేవలం గేమ్‌పై ప్రేమ, ఎంజాయ్‌మెంట్‌,  వినోదం మాత్రమే అని.. నేను ధావన్‌ను అవమానించలేదని తెలిపాడు. అయితే ఫీల్డ్‌లో ధావన్‌తో జరిగిన చిట్‌చాట్‌ను కూడా షమ్సీ గుర్తుచేస్కుని, తాను వేసిన తొలి రెండు బంతుల్ని ధావన్‌ ఎందుకు సిక్సర్లగా కొట్టలేదని అడిగా అని చెప్పారు. శిఖర్‌ ధావన్‌ తన ప్రశ్నకు నవ్వుతూనే సమాధానం చెప్పారని తెలిపారు.

మొదట బ్యాటింగ్‌  చేసిన భారత్‌ చేసిన 134 పరుగులలో ధావన్‌ 36పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 135 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు పొందింది. ఈ జట్టు కెప్టెన్ 52బంతుల్లో 79పరుగులు సాధించి విజయాన్ని తెచ్చిపెట్టాడు.