నా భర్త వల్లే సైరా హిట్ అంటున్న సుదీప్ భార్య

నా భర్త వల్లే సైరా హిట్ అంటున్న సుదీప్ భార్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం విడుదలై హిట్ టాక్‌ను తెచ్చుకుంది. బ్రిటిష్ దొరలకు ఎదురెళ్లి పోరాడిన యోధుడు కథను ఎంతో గొప్పగా తెరపై ఆవిష్కరించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుతంగా చేశారని కొనియాడుతున్నారు.

ఇదే సమయంలో అవుకు రాజు పాత్ర పోషించిన కిచ్చా సుదీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి తరువాత సినిమాలో ఆ స్థాయిలో సుదీప్ మెప్పించగలిగారని అంటున్నారు. కిచ్చా సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ కూడా తన భర్త నటనకు ముగ్దురాలైపోయారు. మా ఆయన ఎంత బాగా చేశాడో అని మురిపిపోతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వెల్లిబుచ్చారు ప్రియ.

‘‘విభిన్న కోణాలతో కూడిన అవుకు రాజు పాత్రను ఎంత సులభంగా చేశారో. ప్రతి సన్నివేశంలో ఆయన కనిపించారు. సినిమాలో ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సుదీప్ నువ్వు రాక్ అంతే!!! ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించడానికి చాలా ధైర్యం ఉండాలి. సైరా నరసింహారెడ్డి లాంటి సినిమా తీసినందుకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి అభినందనలు’’ అని ప్రియ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే, మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసిస్తూ కూడా ఒక ట్వీట్ చేశారు ప్రియ. ‘‘చిరంజీవి గారు నా నోట మాట రాకుండా చేశారు. ప్రతి సన్నివేశంలో ఆయన మిమ్మల్ని కట్టిపడేస్తారు. ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇవ్వగలరు. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గ్రేట్ విజన్ ఉంది. ఒక గొప్ప కలను మీరు సాకారం చేశారు. ఇంత కన్నా గొప్ప విజయం మీకు ఉండకపోవచ్చు. ‘సైరా నరసింహారెడ్డి’ కచ్చితంగా చూడాల్సిన సినిమా’’ అని ప్రియ వెల్లడించారు.