దండుపాళ్యం దర్శకుడితో సుమంత్ అశ్విన్ చిత్ర విశేషాలివే..

sumanth ashwin next movie with srinivasa raju

హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో మరో ప్లాపును తన ఖాతా లో వేసుకున్న సుమంత్ అశ్విన్ రూటు మార్చి హార్రర్ సినిమాలో నటిస్తున్నాడు. దండుపాళ్యం సినిమాలతో మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సౌత్ లోని నాలుగు భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాని ఎం. కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. ఈయనే రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గరుడవేగ సినిమాని నిర్మించారు.

Actor Sumanth Ashwin Horror Thriller

ఇది విభిన్న నవంబర్ రెండో వారం నుండి షూటింగ్ మొదలవుతున్న ఈ సిమా గురించి, దర్శకుడు చెప్తూ “ఇది విభిన్న కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా అని, హార్రర్ నేపథ్యం లో సాగినా , ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశాలు చాలా ఉన్నాయని, హార్రర్ చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్ చేయగల సినిమా ఇదవుతుందని, కథ ప్రకారం ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని సౌత్ లోని అన్ని భాషల్లో చిత్రీకరించి, ఒకేసారి విడుదల చేస్తామని, రీ-రికార్డింగ్ కి ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా మణిశర్మ గారిని తీసుకున్నామని” చెప్పారు.