అల్లు వారి పాట కోసం కష్టపడుతున్న తమన్

అల్లు వారి పాట కోసం కష్టపడుతున్న తమన్

ఎస్.ఎస్.థమన్ సారథ్యంలో అల వైకుంఠపురములో చిత్రానికి పాటలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సామజవరగమన అనే తొలి పాటను రికార్డింగ్ చేస్తున్నారు. ఈ మెలోడీని కంపోజ్ చేయడానికి చాలా కూతూహలంగా పని చేశారు  తమన్. ఇక దీనికోసం పూర్తిగా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆధారపడలేదని చెబుతున్నాడు. ఈ పాట కంపోజిషన్ ద్వారా ఎమోషనల్ హైని చూపిస్తున్నానని ఓ వీడియో చాట్ లో తమన్ వెల్లడించారు.

సామజవరగమన రికార్డింగ్ సమయంలో ఎమోషనల్ మూవ్ మెంట్ ని షూట్ చేసి వీడియోని లాంచ్ చేయాలనుకుంటున్నారట.తమన్ మాట్లాడుతూ..“ బన్నికి పాటలు చేయడం అంటేనే ఠఫ్.  చాలా ఆలోచించాల్సి ఉంటుంది. బన్ని డ్యాన్సులకు తగ్గట్టు ఏదైనా పాటను చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తన కొరియోగ్రఫీ భిన్నంగా ఉంటుంది. ఆలోచనలు  వేరు. ఇంతకుముందు రేసుగుర్రం.. సరైనోడు చిత్రాలకు చేశాను. ఇప్పుడు త్రివిక్రమ్ – బన్ని గారితో పని చేస్తున్నా.

వారి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్. వీళ్లతో పని శైలి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాగే సామజమరగమన అనే పాటను చేయాలని ఐడియా ఇచ్చారు. నేచురల్ సౌండ్స్ తో ఈ పాటను చేయాలనుకున్నాం. పిల్లనగ్రోవి సహా వయోలిన్  ఇతరత్రా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాను. ఇక ఈ పాటను  సీతారామ శాస్త్రి గారు రచించారు. ది బెస్ట్ గా నిలిచే పాట ఇది. సిధ్ శ్రీరామ్ పాట మనస్పూర్తి గా పాడాడు. అల్లు అరవింద్ .. హారిక సంస్థ ఈ ఆఫర్ ఇచ్చింది. వారికి థాంక్స్“ అని తెలిపారు.

ఇక లిరికల్ వీడియో బదులుగా సామజవరగమన పాటను లాంచ్ చేస్తున్నారు అంటే అది అభిమానులకు పండగే.అయితే   ఈ  పాట  కోసం 70  మంది ఆర్కెస్ట్రా.. 35 మంది బ్యాండ్ బృందం.. ఎంతో శ్రద్ధగా పని చేస్తే పుట్టుకొచ్చిన పాట ఇది అని అంటున్నారు