గీతం మూర్తి దుర్మరణం…!

TDP MLC Murthy Passed Away

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ ఎమ్మెల్సీ, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. మూర్తి సహా మరో ముగ్గురు మృతి చెందారు. అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఈయనతో పాటు కారులో ఉన్న వెలువోలు బసవపున్నయ్య, వీరమాచనేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరి అనే వ్యక్తులు మృతి చెందారు.

geetham-murthy

కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 6న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో మూర్తి ప్రసంగించాల్సి ఉంది. అందుకోసమే ఆయన అమెరికా వెళ్లారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తానా సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో మూర్తి బృందం ప్రయాణిస్తున్న కారు గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది.

geetham-university-mlc