మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ

మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ

మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపాయి. టెక్‌సాక్షం పేరుతో 62,000 మందికి ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, వెబ్‌ డిజైన్, డిజిటల్‌ మార్కెటింగ్‌ అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది.

నిపుణులైన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్‌షిప్స్, చిన్న వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం శిక్షణ ఇస్తారు.