మహారాష్ట్ర రాజధాని ముంబైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలకు విధించే భారీ జరిమానా ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 56 వాహనాలకు జరిమానా విధించగా అందులో 9 కార్ల యజమానులు రూ.10,000 చొప్పున చెల్లించారు. మిగిలిన వారు పెనాల్టీతో కలిపి త్వరలో చెల్లించే అవకాశముంది. నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపితే కనిష్ఠంగా రూ.5000 నుంచి గరిష్ఠంగా రూ.23000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.